కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నకిలీ పేరుతో దేశాన్ని మోసం చేస్తున్నారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. యూపీలోని ఘటంపూర్ ఎన్నికల సభలో యోగి మాట్లాడుతూ బ్రిటన్, ఇటలీ దేశాల్లో రాహుల్ పేరు ‘రావుల్ విన్సీ’ అని, ప్రియాంక గాంధీ కూడా తన అసలు పేరేంటో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ వారసుడు రాహుల్ గాంధీగానే అందరికీ తెలుసని, కానీ ఆ పేరుతో యావత్ దేశం మోసపోయిందని తెలిపారు.
అమేథీ నియోజకవర్గంలోరాహుల్ దాఖలు చేసిన నామినేషన్ లో తేడాలు ఉన్నాయంటూ స్వతంత్ర అభ్యర్థి ధ్రువ్ లాల్ ఆరోపించడం తెలిసిందే. బ్రిటన్ లో రిజిస్టర్ అయిన కంపెనీల్లో రాహుల్ పేరు ‘రావుల్ విన్సీ’ అని పేర్కొన్నారని, కానీ ఆ సమాచారాన్ని ప్రమాణ పత్రంలో పొందుపరచలేదంటూ ధ్రువ్ లాల్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పై యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు చేశారు.
కేసులు మాఫీ చేసుకోవడానికే జగన్ ఢిల్లీ వెళ్లారు: ఎంపీ కేశినేని