telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మోత్కుపల్లి నర్సింహులుకు కరోనా.. ఐసీయూలో చికిత్స

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా  మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు కరోనా సోకింది. గత కొంత కాలంగా కరోనా తో బాధపడుతున్న మోత్కుపల్లికి శనివారం అర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఏర్పడ్డాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉండటం తో వైద్యులు ఐసీయూలో ఉంచి మరీ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమ్యంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 

Related posts