telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సెమీస్‌లో టీమిండియా గెలవాలంటూ పూజలు

Team India won by New Zealand

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ పై భారత జట్టు ఘనవిజయం సాధించాలని తెలంగాణలో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. టీమిండియా ధీటుగా రాణించి న్యూజిలాండ్‌పై గెలవాలని వేడుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు.

ఈ సెమీస్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితుల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన జట్లకు మెరుగైన విజయావకాశాలు ఉన్న నేపథ్యంలో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ టాస్ నెగ్గిన వెంటనే బ్యాటింగ్ అంటూ ఉత్సాహంగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇక టీమిండియాలో కుల్దీప్ యాదవ్ స్థానంలో చాహల్ జట్టులోకి రాగా, న్యూజిలాండ్ జట్టులో సౌథీ బదులు లాకీ ఫెర్గుసన్ జట్టులోకి వచ్చాడు.

Related posts