telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

విదేశీ విద్య కి ఆర్థికసాయం.. 15లక్షలకు పెంపు..

ap logo

ఏపి ప్రభుత్వం చదువులో ముందుండి డబ్బులు లేక చదువుకోలేక పోతున్న విద్యార్ధులకు తీపి కబురు చెప్పింది. వెనుకబడిన తరగతుల వారికి విదేశీ విద్య కింద అందజేసే ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఈ ఉత్తర్వులతో ఎంతోమంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఇది అమలుకానుంది. విదేశాల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసి ఇటీవల ఎంపికైన వారికి ఈ మొత్తం అందనుంది. వారికి రూ.15లక్షల రూపాయలు అంబేడ్కర్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌ పథకంలో ఆర్థిక సాయం అందిస్తాం అని అధికారులు తెలుపుతున్నారు. మెరిట్‌ విద్యార్థులకు ఇదొక మంచి సువర్ణావకాశం. ఆర్థిక సాయానికి వర్తించే నిబంధనల విషయానికి వస్తే.. పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివేందుకు వీలుగా ఏటా వెయ్యి మందికి ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం ఆరు లక్షలలోపు ఉండాలి. ఉద్యోగుల పిల్లలు కూడా ఈ పథకానికి అర్హులు. వారి సంవత్సర ఆదాయం కూడా ఆరు లక్షలకు మించకూడదు. దరఖాస్తు చేసిన సంవత్సరం జూలై ఒకటి నాటికి అభ్యర్థి వయస్సు 35 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం పరిశీలిస్తే… ఏపీ ఈపాస్‌లో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో 33 శాతం మహిళలకు రిజర్వు చేస్తారు. వారు లేని పక్షంలో పురుషులకు అవకాశం కల్పిస్తారు. ఇదేగాక బీసీల్లో ఏ, బీ, డీ గ్రూపుల వారికి నిబంధనల ప్రకారం రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ఇకపోతే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, డెన్‌మార్క్, రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనా వంటి దేశాల్లో తమ ఉన్నత విద్యను అభ్యసించవచ్చూ. ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనా దేశాల్లో కేవలం మెడిసిన్‌ చదువుకునేందుకు మాత్రమే అనుమతినిస్తున్నారు.. స్కాలర్ షిప్ పొందాలంటే విద్యార్థి ల్యాండింగ్‌ పర్మిట్‌ చూపించగానే రూ.5లక్షలు మొదటి దఫాగా ఇస్తారు. సెప్టెంబర్‌ రిజల్ట్‌ రాగానే రెండో దఫా రూ.5లక్షలు ఇస్తారు. ఇందుకు గాను చదువుకున్న విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

Related posts