telugu navyamedia
వార్తలు సామాజిక

అమితాబ్ కుటుంబంలో కరోనా కలకలం.. ఐశ్వర్యరాయ్ కుమార్తె కు పాజిటివ్

Aishwaryarai daughter corona

కరోనా వైరస్ బాలీవుడ్ ప్రముఖులను వణికిస్తోంది. ఇప్పటికే అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడ్డారు. అమితాబ్, అభిషేక్ ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా అభిషేక్ అర్ధాంగి ఐశ్వర్య రాయ్, కుమార్తె ఆరాధ్యలకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

ఈ ఉదయం ఐశ్వర్య, ఆరాధ్యలకు తెమడ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చిందని ముంబయి నగర మేయర్ కిశోరి పెడ్నేకర్ తెలిపారు. అయితే, రెండో టెస్టులో వారిద్దరికీ పాజిటివ్ వచ్చిందని బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) కమిషనర్ వెల్లడించారు.అమితాబ్ అర్ధాంగి జయా బచ్చన్ కు యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు తెలిసింది. అమితాబ్ కుటుంబంలో పలువురికి కరోనా సోకడంతో వారి నివాస భవనంను బీఎంసీ అధికారులు మూసివేసి శానిటైజ్ చేశారు.

Related posts