గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తున్న వలంటీర్లకు మద్దతుగా ఏపీ సీఎం జగన్ చప్పట్లు కొడుతూ అభినందించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. వాలంటీర్లు చేస్తున్న సేవలను ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు. వాలంటీర్ల వల్ల గ్రామ స్వరాజ్యం వచ్చిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరూ చప్పట్లు కొడుతూ సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చప్పట్లతో వాలంటీర్లకు అభినందనలు తెలిపారు.