ఈ నెల 14 నుంచి 23 వరకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్టులకు హాజయ్యే అభ్యర్థులు శనివారం నుంచి అధికారిక వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష ఉంటుందని, పాత ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్, ఢిల్లీలో పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపింది.
హాల్టికెట్లను భద్రపరుచుకోవాలని, డూప్లికేట్ హాల్టికెట్లను ఇవ్వడం కుదరదని స్పష్టంచేసింది. హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురైతే 040-22445566 హెల్ప్డెస్క్ను సంప్రదించాలని సూచించింది.