telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కరోనా సోకిన ప్రాంతాల్లో.. కంటైన్‌మెంట్ క్లస్టర్లు: జీహెచ్ఎంసీ

karona chekup hospital

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో వైరస్ సోకిన వ్యక్తులు ఎక్కువగా ఉన్న 12 ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటించింది. ఇందులో రాంగోపాల్‌పేట, రెడ్‌హిల్స్, మూసాపేట, గాజులరామారం, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, చందానగర్ సహా పలు ప్రాంతాలు ఉన్నాయి. అలాగే, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ మూడు ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు

ఈ ప్రాంతాలను అధీనంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో మొత్తం 175 కరోనా కేసులు నమోదు కాగా, వీటిలో 89 మంది ఆయా ప్రాంతాల వారే కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్లస్టర్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌కు కానీ, ఐసోలేషన్‌కు కానీ తరలిస్తారు. ఆ ప్రాంతాల్లోని వ్యక్తులు బయటకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తారు.

Related posts