telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రామగుండం అభిమానులను కలిసిన రెబల్ స్టార్…

Prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ తాజాగా మొదలు చేసిన సినిమా సలార్. జాతీయ స్థాయి గుర్తింపు పొందిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ తాజాగా పాల్గొన్నారు. ఈ సినిమా ప్రస్తుతం రామగూడెంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆ చుట్టుపక్కల ప్రజలంతా తమ అభిమాన హీరోను చూసేందుకు తరలి వచ్చారు. అయితే తాజాగా ప్రభాస్.. ఇవాళ పారిశ్రామిక ప్రాంత అభిమానులు, సింగరేణి ముఖ్య అధికారులు, లోకల్ నాయకులతో సమావేశమయ్యారు. సలార్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ షూటింగ్ ప్రాంతంలోనే పడిగాపులు గాస్తున్నారు. దింతో అభిమానులను కలిసేందుకు ప్రభాస్ ఒకే అనడంతో రామగుండం సీపీ ఆదేశాల మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో యంగ్ రెబర్ స్టార్‌ను చూసేందుకు భారీగా అభిమానులు చేరుకోవడంతో వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. కాగా, కాసేపు గోదావరిఖని ప్రాంత అభిమానులతో ప్రభాస్ చిట్‌చాట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతీహాసన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను భారీ యాక్షన్ సీన్స్‌తో అత్యంత భారీగా తెరకెక్కించనున్నారు. మరి ఈ సినిమాలో ప్రభాస్ ఏ పాత్రలో కనిపించనున్నాడో చూడాలి మరి.

Related posts