telugu navyamedia
రాజకీయ

జూన్‌ 1 నుంచి 119 గురుకులాలు!

huge job notification in telanganaf
తెలంగాణ సర్కార్ కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించే  దిశగా రాష్ట్ర్ర వ్యాప్తంగా కొత్తగా మంజూరైన గురుకులాలను రానున్న విద్యాసంవత్సరం  నుంచి ప్రారంభించనుంది. వచ్చే జూన్‌ 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని బీసీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యభుట్టు తెలిపారు. మరిపెడ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావుపూలే గురుకులాన్ని గురువారం తనిఖీ చేశారు. 
గురుకులంలో విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని, వంటశాలను పరిశీలించారు. ఉపాధ్యాయులకు పాఠ్యాంశాల బోధనపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 142 (1నుంచి 5వ తరగతి) గురుకులాలు, 19 గురుకులాలు(6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు), ఒక డిగ్రీ గురుకులాల్లో అప్‌ గ్రేడేషన్‌ పూర్తయిందని తెలిపారు. వచ్చే జూన్‌ 1 నుంచి కొత్తగా అన్ని మండల కేంద్రాల్లో 119 బీసీ గురుకులాలను ప్రారంభిస్తామని మల్లయ్యభుట్టు తెలిపారు.

Related posts