telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపటి బంద్ లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలి: రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

రేపు జరగనున్న తెలంగాణ బంద్ లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రేవంత్ మాట్లాడుతూ. మాట్లాడుతూ 85 వేల కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్నేశారన్నారు.

తెలంగాణలో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ సమ్మె పై కేసీఆర్ వైఖరిని తప్పుబట్టారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ప్రభుత్వంతో పోరాడి తమ డిమాండ్లను సాధించుకోవాలన్నారు.

Related posts