telugu navyamedia
రాజకీయ వార్తలు

అనారోగ్యంతో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే మృతి…

తీవ్ర అనారోగ్యానికి కారణంగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ శాసనసభా పక్ష మాజీ నేత గుండా మల్లేష్‌ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గుండా మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. మల్లేష్ ఇక లేరన్న విషయం తెలుసుకున్న సీపీఐ నేత నారాయణ గృహనిర్బంధం నుంచి బయటికొచ్చి నిమ్స్ ఆస్పత్రికి బయల్దేరారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1970లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ నాయకుడిగా మారారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సభానాయకుడిగా కూడా వ్యవహరించారు గుండా మల్లేష్.

Related posts