telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆ రాష్ట్రాల్లో ప్రియాంకా గాంధీ ఎందుకు ప్రచారం చేయడం లేదు: కేజ్రీవాల్

Kejriwal AAP MLA Baldev Singh Resign

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఎన్నికలలో ప్రచారంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో ఆమె ప్రచారం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. బీజేపీతో నేరుగా పోటీ ఉన్న ప్రాంతాల్లో ఆమె ప్రచారం చేయడం లేదని అన్నారు. ఎస్పీ, బీఎస్పీలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారా? అని అడిగారు. బీజేపీతో నేరుగా పోటీ ఉన్న ప్రాంతాల్లోకి రాహుల్, ప్రియాంకలు ప్రచారని వెళ్లడం లేదని ఆరోపించారు. ప్రియాంకా గాంధీ అనవసరంగా సమయాన్ని వృథా చేస్తున్నారనిఅన్నారు.

రాంలీలా మైదానంలో ర్యాలీ నిర్వహించనున్న ప్రధాని మోదీని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నానని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదాను కల్పిస్తామని చెప్పి, ఎందుకు వెనకడుగు వేశారు? అని ప్రశ్నించారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో మీకున్న సంబంధం ఏమిటని అడిగారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని ఇమ్రాన్ ఎందుకు అన్నారు? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Related posts