telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రాజెక్టుల నిధులను జగన్ కు దోచిపెట్టిన కేవీపీ: దేవినేని

Minister Devineni uma fire ys jagan

కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు పై ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిధుల్ని జగన్‌కు దోచిపెట్టింది కేవీపీ అని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆయన అబద్ధాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో పోలవరానికి పలు జాతీయ అవార్డులు వచ్చిన విషయాన్ని ఉమ గుర్తుచేశారు.

వైఎస్ హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని దుయ్యబట్టారు. కేవీపీ ఓ గుంటనక్కలా వ్యవహరిస్తున్నారని దేవినేని ఎద్దేవాచేశారు. కేవీపీ ఎప్పుడైనా పోలవరం గ్యాలరీ వాక్ చూశారా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడవద్దంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎప్పుడైనా లేఖ రాశారా? అని నిలదీశారు.

ఇవేమీ పట్టించుకోని కేవీపీ ఇప్పుడు పోలవరంపై ఉత్తరాలు రాస్తున్నారని ఏద్దేవా చేశారు. ఏపీకి రావాల్సిన రూ.4,580 కోట్లను కేంద్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రాజెక్టులకు నిధులు రాకుండా ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో టీడీపీ విజయం సాధిస్తుందని ఉమా ధీమా వ్యక్తం చేశారు.

Related posts