telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు..సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు

ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అడ్డదిడ్డమైన లెక్కలు చెబుతూ అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారని అన్నారు. రైతుల పేరుతో జగన్ వికృత రాజకీయం మొదలుపెట్టారని విమర్శించారు. బడ్జెట్ కాగితాల్లో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి.. ఇప్పుడు 391 మందివి మాత్రమే ఆత్మహత్యలని తేల్చారని విమర్శించారు.

అసెంబ్లీలో 1160 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెబుతూ.. అందులో 454 మందివి ఆత్మహత్యలని తేల్చారని పేర్కొన్నారు. జగన్‌ది మాయా ప్రభుత్వం అని విమర్శించారు. “టీడీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలంటూ దొంగలెక్కలు చెప్పడం మాని.. మీ నాన్న హయాంలో చనిపోయిన 15వేల మంది రైతులకు ఓదార్పునివ్వాలని ప్రార్థిస్తున్నాను” అంటూ ట్విట్టర్లో లోకేష్ పేర్కొన్నారు.

Related posts