telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అల్జీమర్స్ రోగిలా కేసీఆర్ మారిపోయారు..

తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవద్దని.. కేసీఆర్, కేటీఆర్ లు ఓటర్లను మోసం చేసేందుకు మళ్ళీ కుట్ర చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. గతంలో కేసీఆర్ కుక్క తోకను ఊపుతాదా.. తోకను కుక్కను ఊపుతాదా అని అన్నారు. ఇప్పుడు అదే కేసీఆర్ ఓట్ల కోసం ఇంటికి పిలిపించుకుని మాట్లాడుతున్నారని…ఎవరూ మోసపోవద్దని పేర్కొన్నారు. ఇప్పటికైనా గొర్రెల్లా మోసపోవద్దు.. కొంతమంది నాయకులు పాల ప్యాకెట్లు, పాటకులు జేబులో పెట్టుకొని తిరుగుతితున్నారని తెలిపారు. టిఆర్ఎస్ ను ఓడిస్తే మీ హక్కులు, మీ జీతాలు ఇంటికి వస్తాయని… పీఆర్సీ కేసీఆర్ ఇచ్చే బిక్ష కాదని… అది సహజంగా జరిగే ప్రక్రియ.. అది ఉద్యోగుల హక్కు అన్నారు. గతంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. ghmc ఎన్నికలలో వరద బాధితులకు 10 వేల సహాయం ఇస్తామన్నారు… ఇంటింటికి తాగు నీరు ఉచితంగా ఇస్తామన్నారు.. అవన్నీ మర్చిపోయారు.. అల్జీమర్స్ రోగిలా కేసీఆర్ మారిపోయారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర సెట్లర్ల ఓట్ల కోసమే విశాఖ ఉక్కు గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని… కూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తాడట అంటూ మండిపడ్డారు. ఇక్కడ ఇంట్లో ఉన్న సమస్యలు పరిష్కరించి మిగతావి తర్వాత చూడాలని చురకలు అంటించారు.

Related posts