భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా రాజ్ ఘాట్ వెళ్లారు. రాజ్ ఘాట్ లో మహాత్ముడి సమాధిని సందర్శించారు. మహాత్ముడి సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం, ట్రంప్ దంపతులకు గాంధీ విగ్రహ జ్ఙాపికను కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ అందజేశారు.
అనంతరం అక్కడున్న సందర్శకుల బుక్లో ట్రంప్ దంపతులు సంతకం చేశారు. అమెరికా ప్రజలు అండగా నిలుస్తారని రాజ్ ఘాట్ లోని సందర్శకుల పుస్తకంలో ట్రంప్ రాశారు. ఇది ఘనమైన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ట్రంప్తో కలిసి మెలానియా.. రాజ్ఘాట్లో మొక్క నాటారు. రాజ్ఘాట్ నుంచి నేరుగా హైదరాబాద్ హౌస్కు డొనాల్డ్ ట్రంప్, మెలానియా బయల్దేరారు.