కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడ్డారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా టచ్ చేసింది కరోనా.. తాజాగా.. మాజీ మంత్రి సునీతా లక్ష్మా రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనను కలిసిన వ్యక్తులు కరోనా టెస్టులు చేయించుకోవాలని అయన కోరారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో మాజీ మంత్రి చికిత్స పొందుతున్నారు. గత నెల రోజులు గా దుబ్బాక టీ ఆర్ ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో సునీత పాల్గొంటుంది. దీంతో దుబ్బాక ప్రచారంలో పాల్గొన్న నేతల్లో ఆందోళన మొదలైంది. ఎవరికీ కరోనా సోకుతుందో అని భయపడుతున్నారు.
previous post
రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు: వీహెచ్