telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్‌ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

Revanth-Reddy mp

కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కూకట్‌పల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. రేవంత్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని..రేవంత్‌ తరపు న్యాయవాది శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పు రేపటికి వాయిదా వేసింది.

తన క్లయింటుపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది శ్రీనివాసరావు వాదించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కేసులు బనాయించారని ఆరోపించారు. పాత కేసుల్లో రేవంత్‌పై పీటీ వారెంట్‌ను హైదరాబాద్ పోలీసులు అడిగారని పోలీసుల తరపు లాయర్‌ పేర్కొన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కేసులు పెట్టారని శ్రీనివాసరావు తెలిపారు.

Related posts