telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

బాక్సింగ్‌ ప్రపంచకప్‌ : భారత్ కు రెండు పథకాలు ఖాయం.. పింకీ రాణి, సాక్షి..

pinki and sakshi in semifinals

భారత్‌కు బాక్సింగ్‌ ప్రపంచకప్‌లో మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. కామన్వెల్త్‌ కాంస్య విజేత పింకీ రాణి (51 కేజీ), యూత్‌ ప్రపంచ ఛాంపియన్‌ సాక్షి (57 కేజీ) సెమీఫైనల్లో అడుగుపెట్టారు. మంచి ఫామ్‌ను కొనసాగించిన పింకి గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 5-0తో థాయ్‌లాండ్‌కు ఎందిన ఫున్సాగ్‌ కహిరాంచ్యపై విజయం సాధించింది.

హోరాహోరీగా సాగిన మరో క్వార్టర్స్‌లో సాక్షి.. సెసిలె కెలె (డెన్మార్క్‌)ను ఓడించింది. మీనా కుమారి (54) ఫైనల్‌కు, బసుమతరి (64) సెమీఫైనల్‌కు చేరడంతో భారత్‌కు ఇప్పటికే రెండు పతకాలు ఖాయమయ్యాయి. పోటీదారులు తక్కువగా ఉండడంతో వీళ్లకు నేరుగా ఫైనల్‌, సెమీస్‌లో చోటు దక్కింది. మరోవైపు 69 కేజీ విభాగంలో అంజలి తుషిర్‌ తొలి రౌండ్లోనే పరాజయంపాలైంది.

Related posts