మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా నాగార్జున హీరోగా ప్రస్తుతం చిలసౌ ఫేం రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో “మన్మథుడు-2” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రంలో. రావు రమేశ్, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్, దేవదర్శిణి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. మనం ఎంటర్ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయ్కామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిరణ్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా పని చేస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. రీసెంట్గా విడుదలైన టీజర్కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. “ఎప్పుడైనా ప్రేమలో పడ్డావా?` అని రకుల్ అడిగితే.. `ఒక్కపూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను” అని నాగ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక “బాగానే ఉన్నావ్ కదమ్మా.. వీడ్ని పెళ్లి చేసుకుంటున్నావేంటి” అంటూ రావు రమేష్ చెప్పిన డైలాగ్ కూడా బాగుంది. నాగ్ వయసుపై పడిన సెటైర్లు బాగా పేలాయి. ఈ ట్రైలర్లో కూడా లిప్లాక్ సన్నివేశాలను చూపించారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post
హీరోయిన్ వయసుపై టీవీ నటుడి కామెంట్స్… ఆమె స్పందన ఇదీ