telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు: వీహెచ్‌

Congress Hanmanth Rao Governor TRS agent

రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. గురువారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా అధైర్యపడవద్దని ఆ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌ అధికారంలోకి వస్తారన్న నమ్మకం లేదన్నారు.

ప్రధానమంత్రి మోదీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండరని ఆయన అన్నారు. సమయం వచ్చే వరకు వేచి చూడాలన్నారు. పదవులు లేకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆయారాం గయారాంలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని వీహెచ్‌ వ్యాఖ్యానించారు.

Related posts