క్షణం, గూఢచారి వంటి అభిరుచి గల కథాంశాల్ని ఎంచుకొని చక్కటి విజయాల్ని అందుకున్న అడవి శేష్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన “ఎవరు” చిత్రంతో ప్రేక్షకులను థ్రిల్ చేశాడు. కెరీర్లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న ఈ కుర్ర హీరో అడివి శేషు తాజాగా “మేజర్” అనే బయోపిక్లో నటిస్తున్నారు. 2008లో ముంబైలో జరిగిన టెర్రర్ అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ కమాండర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ మేజర్ చిత్రం తెరకెక్కుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సారి అడవి శేషుతో ‘మేజర్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే గత ఏడాది కాలంగా చర్చల్లో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది అనే అప్ డేట్ ఇప్పటివరకు లేదు. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభించారు అని తెలుస్తుంది. ఎప్పటికప్పుడు షూటింగ్ జరిగే స్థలం లో శానిటైజేషన్ చేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా యూనిట్ సభ్యులందరికి కూడా కరోనా పరీక్షలు చెయ్యగా అందులో దాదాపు సగం మందికి కరోనా వచ్చినట్లు తెలుస్తుంది. దాంతో నిర్మాత మహేష్ బాబు అందులో పాల్గొనే వారందరిని ఐసోలేషన్ కు వెళ్లాలంటూ సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం హీరో అడవి శేషు కూడా ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.