తెలంగాణ సీనియర్ లీడర్ అయిన నాయిని నర్సింహ రెడ్డి కుటుంబ సభ్యులను ఇవాళ డి శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా డి శ్రీనివాస్ మాట్లాడుతూ…నాయిని మృతి తనకు ఎంతో బాధను కలిగించిందని పేర్కొన్నారు. నాయిని తనకు విద్యార్థి దశ నుండి స్నేహితుడని తెలిపారు. తన కంటే వయసులో పెద్దవాడు అయినా కానీ తనను శీనన్న అని ఎంతో ఆప్యాయంగా పిలిచే వారని చెప్పారు డి శ్రీనివాస్. ఆ కాలంలో ఆయన బులెట్ పైన వస్తుంటే పులిలా ఉండేవారని…తెలంగాణ కోసం ఎంతో కృషి చేసారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయనకు ఉహించినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి దశలో ఆయన అసంతృప్తి తో ఉన్నారని… ఇప్పటికైనా వారి పిల్లలకు గుర్తింపు ఇచ్చి, తగిన ప్రాధాన్యత దొరుకుతుందని కోరుకుంటున్నానని తెలిపారు. వారి కుంటుంబ సబ్యులకు, బంధువులకు సానుబూతి తెలుపుతున్నానని అన్నారు.
previous post
రాష్ర్టాభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారు: మంత్రి ఎర్రబెల్లి