రాజధాని అమరావతితో పాటు పోలవరం నిర్మాణ పనులను నిలిపివేసిన ఏపీ సర్కారు. తాజాగా పంచాయతీరాజ్లో ఇంజినీరింగ్ పనులు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.58.64 కోట్ల విలువైన ఇంజినీరింగ్ పనులు ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్రవ్యాప్తంగా 144 పనులు నిలిపివేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ ఒకటికి ముందు అనుమతి పొంది… ప్రారంభంకాని పనులు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పనులు ప్రారంభమైనా 25 శాతానికి మించని వాటిపై రివ్యూ నిర్వహించారు. విజయనగరం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు మినహా ఇతర జిల్లాల్లో ప్రభుత్వం పనులు నిలిపివేసింది.