జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైన నటి కీర్తి సురేశ్ కు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రపరిశ్రమ ఏడు అవార్డులు దక్కించుకోవడం పవన్ హర్షం వ్యక్తం చేశారు. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘మహానటి’లో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేశ్ నటన ఈ అవార్డుకు అర్హమైనదే అని ప్రశంసించారు. ఈ సందర్భంగా తన తరపున, జన సైనికుల తరపున అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.
అలాగే ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ సినిమాలకు సంబంధించి సాంకేతిక విభాగాల్లో అవార్డులకు ఎంపికైన వారిని కూడా అభినందించారు. ఈ స్ఫూర్తితో తెలుగు చిత్రసీమ నుంచి మరిన్ని చిత్రాలు రావాలని పవన్ ఆకాంక్షించారు. కీర్తి సురేశ్, పవన్ కల్యాణ్ జోడీ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటించింది. ఈ సినిమా గతేడాది జనవరి 10న విడుదలైంది. ఆ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” చెయ్యడం ఒక లైఫ్ చేంజింగ్… కానీ… : శృతి హాసన్