ప్రపంచ కప్ వేడి ఎంతగా పాకిపోయిందంటే, ఎక్కడ పట్టినా అదే చర్చ. ఎవరు కప్ కొట్టుకుపోయారు.. మనవాళ్లకు వస్తుందా.. వస్తే, పార్టీ ఎలా చేసుకుందాం.. అంతా ఇదే చర్చ. ఇక ఇది సామాన్యులలోనే కాదు, రాజకీయనాయకులు, తోటి క్రీడాకారులు, సినీ నటులు ఇలా ఒక్కరేంటి అందరిలో అదే ఉత్సాహం.. ప్రపంచ కప్ ఉత్సాహం. దీనికి ఉదాహరణగా, నేడు ఆతిధ్య జట్టుతో భారత్ తలపడుతున్న మ్యాచ్ తిలకించేందుకు నటులు అందాల భామలు త్రిష, వరలక్ష్మీ శరత్కుమార్ లాంటివారు భారత క్రికెట్టు ఆటను చూడడానికి, వారిని ఉత్సాహపరచడానికి ఏకంగా ఇంగ్లాడ్ దేశానికి ఎగిరిపోయారు. ఇప్పుడు వరల్డ్ కప్ క్రికెట్ వార్ జరుగుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిందిన అవసరం లేదు. మధ్యాహ్నం అయితే జనాలు టీవీల ముందు వాలిపోతున్నారు. ఇక భాగ్యవంతులైతే ప్రత్యక్షంగా చూడడానికి క్రికెట్ జరుగుతున్న స్టేడియంకే వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతానికి విజయవిహారం చేస్తోంది. ఆరు పోటీల్లో ఐదింటిలో విజయం సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ఇంకా మూడు పోటీలు ఉన్నాయి. మరో పోటీలో గెలిస్తే సెమీ ఫైనల్కు చేరుకుంటుంది. ఆదివారం ఇండియా జట్టు ఇంగ్లాండ్ జట్టుతో ఢీకొనబోతోంది. ఈ పోటీ ఇరుజట్లకు ముఖ్యమే. ఇండియాను సెమీఫైనల్కు చేర్చే పోటీ అయితే, ఇంగ్లాండ్ను పోటీలో నిలిపేపోరు. అవును ఈ పోటీలో గెలవకపోతే ఇంగ్లాండ్ సెమీఫైనల్ అవకాశాలను కోల్పోతుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఆ జట్టుకు చాలా ముఖ్యం. దీంతో ఇరు జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ క్రీడను ప్రత్యక్షంగా తిలకించడానికి, ఇండియా జట్టును ఎంకరేజ్ చేయడానికి నటి త్రిష, వరలక్ష్మీశరత్కుమార్, బిందుమాదవి ఇంగ్లాండ్కు చేరుకున్నారు. దీని గురించి నటి వరలక్ష్మీశరత్కుమార్ ట్విట్టర్లో కామెంట్ చేశారు.
జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలి: జేసీ దివాకర్రెడ్డి