ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు కుర్రకారును మాయ చేసింది అందాల తార సమంత.కేవలం అభిమానులనే కాకుండా ఆ సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యను కూడా మాయ చేసిందీ బ్యూటీ. ఈ సినిమాతో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం వివాహానికి దారి తీసిన విషయం తెలిసిందే.
మరోవైపు భర్త నాగచైతన్యకు, ఆమెకు మధ్య గొడవలు జరుగుతున్నాయని కొందరు ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల సమంత తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ‘అక్కినేని’ అనే ఇంటి పేరును తొలగించి ‘ఎస్’ అని పేరు రాసుకున్నారునప్పటి నుంచి మొదలైన ఈ పుకార్లు.. ఆగస్టు 29న జరిగిన నాగ్ పుట్టినరోజు వేడుకల్లో సమంత కనిపించకపోవడంతో మరింత బలపడ్డాయి.
.
అయితే, ఈ విషయమై స్పందించేందుకు సమంత నిరాకరించారు. హిందీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘‘ఈ విధమైన విషయాలపై నేను స్పందించను. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వివాదంపై స్పందించమని సుమారు 65వేల ట్వీట్లు చేశారు. నేను అప్పుడూ స్పందించలేదు. ఇప్పుడూ అంతే! మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడతా. ఏదైనా చెప్పాలనిపించినప్పుడు చెబుతా. అంతే కానీ… ఏదొక చెప్పి భూస్థాపితం చేయడానికి చూడను’’ అని సమంత పేర్కొన్నారు.
అలాగే సమంత ప్రస్తుతం.. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శాకుంతలం’ సినిమాలో ప్రాధనప్రాత్రలో నటిస్తోంది. “శాకుంతలం” గురించి మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి యానిమేషన్ లో వచ్చే యువరాణి పాత్రలో తనను తాను ఊహించుకునేదాన్నని, ఇప్పుడు అలాంటి పాత్రలో నటించడంతో తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గుణశేఖర్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.