బాలీవుడ్ స్టార్, కిలాడీ హీరో అక్షయ్ కుమార్ ఈ ఏడాది బాలీవుడ్లో అతి భారీ విజయాలు అందుకున్న హీరో. ఈ ఏడాది ఆయన నటించిన సినిమాలన్నీ 150 కోట్ల రూపాయల పైచిలుకు వసూళ్లు సాధించాయి. అక్షయ్ నటించిన కేసరి (రూ.154 కోట్లు), మిషన్ మంగళ్ (రూ.202 కోట్లు), హౌస్ఫుల్ 4 (రూ.194 కోట్లు), గుడ్న్యూస్ (రూ.200 కోట్లు) సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. అన్నీ బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాకు అక్షయ్ తన పారితోషికాన్ని భారీగా పెంచేశాడట. అక్షయ్ తర్వాతి సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించబోతున్నారట. ఈ సినిమా కోసం అక్షయ్ తీసుకునే పారితోషికం 120 కోట్ల రూపాయలట. సారా అలీఖాన్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో తమిళ స్టార్ ధనుష్ కూడా నటించబోతున్నాడట. అక్షయ్ ఈ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేయడం సబబేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అక్షయ్ సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. అలాగే అక్షయ్ సినిమాల డిజిటల్, శాటిలైట్ రైట్స్కు చాలా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అక్షయ్ ఆ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోవడం తప్పుకాదని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
previous post
పవన్ పేరును వాడుకుని సినిమాలను ప్రమోట్ చేసుకునే స్థాయికి నేను దిగజారలేదు… : అడివిశేష్