telugu navyamedia
తెలంగాణ వార్తలు

విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

 

తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌, ప్రత్యక్ష బోధనపై విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చని తెలిపింది.

హైకోర్టు ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలి అని వెల్లండించింది. వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖకు ఆదేశం పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలి. గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది. గురుకులాలు, విద్యాసంస్థల్లో వసతిగృహాలు తెరవద్దని హైకోర్టు ఆదేశం జారీ చేసింది. గురుకులాలు, హాస్టళ్లలో వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశం. ప్రత్యక్ష బోధనపై పరస్పర విరుద్ధ లాభనష్టాలు ఉన్నాయనా హైకోర్టు రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోంది అంది. హైకోర్టు సెప్టెంబరు లేదా అక్టోబరులో మూడో దశ పొంచి ఉందని హెచ్చరించింది. విద్యాసంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వం రెండింటిని సమన్వయం చేసి చూడాలి అంది. హైకోర్టు విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది.

 

Related posts