ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ దిశ హత్యాచార ఘటనపై సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దిశ కథాంశంపై వివరాలను సేకరించడంలో భాగంగా వర్మ ఈ రోజు శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్ ను కలిసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.
అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ..దిశ ఘటనలో వివరాలు తెలుసుకునేందుకు అందరిని కలుస్తున్నాని తెలిపారు. అయితే ఎవరిని కలుశాను.? వారినేం అడిగాను..? వారేం చెప్పారనేది ఇప్పడే చెప్పలేనని స్పష్టం చేశారు. ఈ సినిమాను వివాదాలతో సంబంధం లేకుండా భావోద్వేగపూరిత కోణాన్ని చూపించాలనేది నా ప్రయత్నం. సినిమా అనేది కళ్లకు కట్టినట్లు చూపించడానికి నేను చేసే ప్రయత్నమని పేర్కొన్నారు.