నటి అమృతా రావు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెకు సినీ ప్రముఖుల నుంచి, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు అమృతా టీం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2016లో తన ప్రియుడు, ఆర్జే ఆన్మోల్ని అమృతా వివాహమాడారు. వారిద్దరికి ఇది మొదటి సంతానం కావడం విశేషం. గత నెలలో తాము తల్లిదండ్రులు కాబోతున్నాం అంటూ తన ప్రెగ్నన్సీ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు అమృత. త్వరలో మా కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నారంటూ తెలిపింది. కాగా బాలీవుడ్లో వివాహ్, ఇష్క్విష్క్, మై హూనా వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన అమృతా.. తెలుగులో మహేష్ బాబు సరసన ‘అతిథి’లో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు.
next post