డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ లో రౌడీ హీరో విజయ్దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న సినిమా ‘లైగర్.’సాలా క్రాస్ బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు.
అంతేకాకుండా వరల్డ్ దిగ్గజ బాక్సర్ మైక్టైసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనతో చిత్రీకరణ చేసేందుకు చిత్రబృందం అమెరికా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి షెడ్యూల్ ప్రారంభించే ముందు పూరీ, దేవరకొండ కలిసి వెగాస్ నగరంలోని ఓ రెస్టారెంట్లో ఎంజాయ్ చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను నటి, నిర్మాత ఛార్మి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “ఇంటెన్స్ షెడ్యూల్ ప్రారంభించడానికి ముందు వెగాస్లో అబ్బాయిలు చిల్ కొడుతున్నారు” అంటూ ఆమె రాసుకొచ్చారు.
పాన్ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.
పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కౌర్ – కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా కలసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఆండీ లాంగ్ ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
లైగర్ ఈ ఏడాది సెప్టెంబర్ 9న థియేటర్లలోకి రావాల్సిఉండగా… కరోనా రెండవ వేవ్ కారణంగా ఈ చిత్రం వాయిదా వేయవలసి వచ్చింది. యుఎస్లో ఈ షెడ్యూల్ను ముగిసిన తరువాత… 2022లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.