పీపీఏల రద్దుపై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్కి ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఈ నోటీసులు జారీ చేసింది. పీపీఏల రద్దుపై స్టే ఇవ్వాలని యాక్సిస్ విండ్ ఫామ్ కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. యాక్సిస్, సుజలాన్ కంపెనీలకు చెందిన 21 ఒప్పందాలు రద్దు చేసుకోవాలని ఏపీ డిస్కంలు నిర్ణయించాయి.
దీంతో ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టినందున డిస్కంల నిర్ణయంపై స్టే విధించాలని యాక్సిస్ కంపెనీ ట్రిబ్యునల్ను కోరింది. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని పనులు ప్రారంభించినందున పీపీఏలను రద్దు చేయొద్దని ట్రిబ్యునల్కు విజ్ఞప్తి చేసింది. దీంతో ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి ట్రిబ్యునల్ నోటీసులు ఇచ్చింది. ఈనెల 26లోగా సమాధానం ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది.
వైసీపీ నేతలు అప్పుడే పదవులు పంచుకుంటున్నారు: యామిని