telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

tirumala temple

తిరుమల శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టనుంది.

నిన్న శ్రీవారిని 66,474 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. రేపు టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు. 2020-21వ సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలుపనుంది.

Related posts