telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి..

వరద నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నామన్నారు. సీఎం అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

భార్యను అల్లరి చేసుకుంటున్న పచ్చి రాజకీయ వ్యభిచారి చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. ఓ పది మందిని మా ఇంటికి పంపితే నేనెందుకు క్షమాపణ చెప్పడం ఏమిటి..? అతని భార్యను అతను అల్లరి చేసుకుంటూ నన్ను క్షమాపణ చెప్పమంటాడేమిటి…?అని నిలదీశారు.

తన భార్య పేరు చెప్పి సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం భార్య పేరు తీసుకురావడం అన్యాయమని నాని అన్నారు. చంద్రబాబు ఎలాగోలా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. భువనేశ్వరి ప్రతిష్టను ఆయన మీడియా దిగజార్చిందని అన్నారు.

తాను సెక్యూరిటీ పెంచుకోవడం లేదు..నేను వదిలేస్తా..ఆయన్ని జడ్ ప్లస్ వదిలేయమనండని సవాల్‌ విసిరారు. ఈ రోజుకీ వైఎస్సార్ ప్రజల గుండెల్లో బతికున్నారు. నువ్వు జగన్ తో పోరాటం చేయలేక పిచ్చి వాగుడు వాగుతున్నావు. నువ్వు బతికున్నా సచినట్లే లెక్క… పాపి చిరాయువు.. ఒక్కో సీఎం విధానం ఒక్కోలా ఉంటుంది… అన్నీ సహాయక చర్యలు పూర్తయినాక చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి… ఏది పబ్లిసిటీ చేసుకోవాలో కూడా తెలియదంటూ చురకలు అంటించారు. వరదల్లో బాధితుల పరామర్శకు వెళ్లి.. నన్ను అవమానించారంటూ చంద్రబాబు ఏడుస్తున్నారని’’ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు.

Related posts