రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ భూములు ఇచ్చిన రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. వికేంద్రీకరణ బిల్లును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికి వచ్చిన నష్టమేమీ లేదని చెప్పారు. మూడు రాజధానులతో అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏఎంఆర్డీఏ సమీక్ష చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమవుతుందని చెప్పారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని అన్నారు.