telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

సైనిక్‌ స్కూలు ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

e-cet results and diet cet exam today

విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రిన్సిపాల్‌ కల్నల్‌ అరుణ్‌ కుమార్‌ విడుదల చేశారు. ఆరో తరగతిలో ప్రవేశానికి 180 మంది ఉత్తీర్ణత సాధించగా, తొమ్మిదో తరగతికి 60 మంది అర్హత సాధించారు.

2019-20 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో చేరేందుకు సుమారు 60 సీట్లు, 9వ తరగతిలో ప్రవేశానికి 20 సీట్లకు దరఖాస్తు ఆహ్వానించారు. అనంతరం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 5న రాతపరీక్ష నిర్వహించారు. మరిన్ని వివరాల కోసం సైనిక పాఠశాల వెబ్‌సైట్‌ www.sainikschoolkorukonda.org లో చూడవచ్చు.

Related posts