జూనియర్ ఎన్టీఆర్కు మాకు సంబంధం ఏంటి అని నాని ఘాటు విమర్శలు చేశారు. ఒకప్పుడు కలిసి ఉండొచ్చు ..విబేధాలతో బయటకు వచ్చామని చెప్పుకొచ్చారు..గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ..ఎన్టీఆర్ కుటుంబం.. ఇంకా చంద్రబాబునే నమ్ముకుందంటూ పేర్కొన్నారు.
మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి .. జగన్ చెబితే ఏదైనా చేస్తాం..ఆయన చెప్పకపోయినా చేస్తాం.. జూనియర్ ఎన్టీఆర్ చెబితే నేను, వంశీ ఎందుకు వింటామని ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడం ఏమిటి..? చంద్రబాబు శిష్యులు మాట్లాడే దానికి కంట్రోల్ చేశారా…అంటూ ప్రశ్నలు కురుపించారు.
జగన్ మోహన్ రెడ్డిని వేధించిన సోనియా గాంధీ నుంచి చంద్రబాబు, లోకేష్ వరకు అందరూ సర్వనాశనమైపోయారని కొడాలి నాని అన్నారు. వైఎస్ జగన్కు దేవుడి ఆశీస్సులు ఉన్నాయని.. ఇలాంటి వారి వేధింపులు ఏం చేయలేవన్నారు. భార్యను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేయడం హేయనీయమని చంద్రబాబును విమర్శించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చబండకు వెళుతూ మరణించారని.. ఆయన ప్రజా సేవే పరమావధిగా భావించారని స్పష్టం చేశారు. వర్ల రామయ్య మాట్లాడితే తాము స్పందించాల్సిన అవసరం లేదంటూ కొడాలి నాని వెల్లడించారు. వర్ల రామయ్య పంచాయితీ వార్డ్ మెంబర్గా కూడా గెలవడని ఎద్దేవా చేశాడు.
అన్నగారి కుటుంబం అంటే అందరికీ గౌరవం ఉంటుంది. ముఖ్యమంత్రికి కూడా గౌరవం ఉంటుందని, వాళ్లు రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవులు ఆశించలేదు, ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు ఆశించలేదని అన్నారు.
వాళ్లు అమాయకులు…ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆ పార్టీ నాశనం అవుద్దని చంద్రబాబు చెప్పినా విన్నారు. గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది..చంద్రబాబు ఏది చెప్పినా నమ్మేస్తారు. అంటూ నందమూరి కుటుంబాన్నిఉద్దేశించి వ్యాఖ్యానించారు.