ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విరుద్ధమైన పాలన సాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నాయకులు ప్రజా జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. హైదరాబాద్లోని తన స్వగృహంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్లో ఉండడంతో కార్యక్రమాన్ని తన ఇంటి మేడపై నిర్వహించారు. గాంధీ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు.
హైదరాబాద్లోని టీడీపీ కార్యాలయంలో పార్టీ టీటీడీపీ అధ్యక్షుడు జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రతిభావంతులను, ప్రజల శ్రేయస్సును కోరే వారిని రాజకీయాల్లోకి తెచ్చారన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.