telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ..

ప్ర‌జ‌ల‌కు అన్యాయం జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ వేళ లేఖ రాశారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా బీసీలు అన్ని రకాలుగా వెనకబడే ఉంటున్నారని , బీసీ జనగణన చేపట్టాలని ప్రధానిని కోరారు.

బీసీలకు సంబంధించిన సరైన డేటా లేకపోవడంతో ఆ వర్గాలకు అన్యాయం జరుగుతోందని లేఖలో ప్రధానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా..బీసీ జనగణన కోసం టీడీపీ హయాంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. ఇప్పుడున్న కులాల వారీ వివరాలు 90 ఏళ్ల నాటివని, అది ఇప్పుడు పనికి రాదని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు

Related posts