ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ గత కొద్ది రోజుల క్రితం కరోనా బారీన పడ్డ విషయం తెలిసిందే. కాగ ప్రస్తుతం లతా మంగేష్కర్ కరోనా నుంచి కోలుకుందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. ఆమె ఆరోగ్య ప్రస్తుతం నిలకడగా ఉందని అన్నారు.
ప్రస్తుతం లతా మంగేష్కర్ పూర్తిగా కోలుకుంటున్నారని అన్నారు. అలాగే లతా మంగేష్కర్ న్యుమోనియా నుంచి కూడా కోలుకున్నారని మంత్రి రాజేశ్ తోపే తెలిపారు.
లతా మంగేష్కర్ ఇప్పటి వరకు వెంటి లేటర్ పైనే ఉండేదని అన్నారు. కానీ ప్రస్తతం ఆమెకు వెంటి లేటర్ సాయం అవసరం లేదని అన్నారు.
అయితే ఆమె ఆక్సిజన్ మాత్రం అందిస్తున్నారని తెలిపారు. అలాగే లతా మంగేష్కర్ ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని అని తెలిపారు. కాగ లతా మంగేష్కర్ జనవరి 11 న కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారు.
తప్పుడు హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారు: కాకాణి