telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్‌ …వారికి 5 లక్షల పరిహారం

cm jagan

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ ప్రపంచ నలుమూలల వ్యాపించింది. మన దేశంలోనూ ఈ వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఎంతో మంది మృతి చెందారు. వీరిలో మరి ముక్యంగా పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులతో పాటు జర్నలిస్టులు ఎక్కువగా ఉన్నారు. ఈ మహమ్మారి కరోనా నించి ప్రజలను కాపాడేందుకు వీరంతా తమ ప్రాణాయాలు ఫణంగా పెట్టారు.

ఈ నేపథ్యంలో కరోనా క్లిష్ట సమయంలోను ముందుండి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ పై పోరులో మృతి చెందిన ప్రతి జర్నలిస్టుకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్నీ ఇవాళ మీడియా కు తెలిపారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో 38 మంది జర్నలిస్టులు కరోనా పోరులో మృతి చెందారు.

Related posts