నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి అయింది. అదృష్టవశాత్తు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కి తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ చెన్నై నుంచి గుడూరికి తన కారులో వస్తున్నారు. ఈ తరుణంలో నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని డీకొన్న ఎమ్మెల్యే కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే వరప్రసాద్ కు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో మరో వాహనంలో ఆయన వెళ్లారు. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్, గన్ మెన్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ముందు వెళుతున్న కారు సడ్డెన్ బేక్ వేయడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇంకా పూర్తి విషయాలు తెలియాల్సి వుంది. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే వరప్రసాద్ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
కోడెల బాంబులకు భయపడలేదు..నీచ రాజకీయాలకు బలయ్యారు: దేవినేని