telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ఏపీ : .. పది పరీక్షలలో .. కొత్తవిధానం అమలు..

AP

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు కొత్త విధానం అమలుకు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థుల భావవ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషా నైపుణ్యాలు, అవగాహన తదితర అంశాలను సమగ్రంగా బేరీజు వేసేలా ఈ విధానాన్ని ప్రభుత్వం రూపుదిద్దింది. ఇందులో బిట్‌ పేపర్‌ రద్దు సహా అనేక నూతన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ మంగళవారం ఉత్తర్వులు (జీఓ 69) జారీ చేశారు. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చిలో జరగనున్న పరీక్షల నుంచే ఈ నూతన విధానం అమలుకానుంది.

ప్రధాన మార్పులు .. పరీక్షలలో విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్‌ బుక్‌ లెట్‌ ఇస్తారు. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. బిట్‌ పేపర్‌ వేరేగా ఉండదు. ప్రధాన ప్రశ్నాపత్రంలోనే లఘు సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఇస్తారు. హిందీ, ఓఎస్సెస్సీ, కాంపోజిట్‌ తెలుగు తప్ప మిగిలిన అన్ని పరీక్షలకు సమయం 2:30 గంటలు. ప్రశ్నపత్రం చదివేందుకు మరో 15 నిమిషాలు. హిందీ పరీక్షకు 3 గంటలు, ఓఎస్సెస్సీ లాంగ్వేజ్, కాంపోజిట్‌ తెలుగు ప్రశ్న పత్రానికి 3.15 గంటల సమయం ఉంటుంది. సర్టిఫికెట్లో సబ్జెక్టుల వారీగా, పేపర్‌ వారీగా గ్రేడులు ఇస్తారు. సబ్జెక్టుల వారీగా 2 పేపర్లలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ప్రశ్నపత్రం స్వరూపం (50 మార్కులకు) :
– ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 12 అబ్జెక్టివ్‌ ప్రశ్నలకు 6 మార్కులు.
– 8 అతిలఘు సమాధాన ప్రశ్నలకు ఒక్కో మార్కు చొప్పున 8 మార్కులు.
– 8 లఘు ప్రశ్నలకు ఒకొక్క దానికి రెండేసి మార్కుల చొప్పున 16.
– 5 వ్యాస రూప (ఎస్సే) ప్రశ్నలకు ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 20 మార్కులు ఉంటాయి.
-లాంగ్వేజ్, కాంపోజిట్‌ తెలుగు ప్రశ్న పత్రానికి 3.15 గంటల సమయం ఉంటుంది.
-సర్టిఫికెట్లో సబ్జెక్టుల వారీగా, పేపర్‌ వారీగా గ్రేడులు ఇస్తారు.
-సబ్జెక్టుల వారీగా 2 పేపర్లలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

Related posts