సోషల్ మీడియాలో కొన్ని కమర్షియల్ బ్యాంకులను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఈరోజు ఆర్బీఐ స్పందించింది. సోషల్ మీడియాలో వార్తల్లో నిజంలేదని ఆర్బీఐ చెప్పింది. అవన్నీ తప్పుడు వార్తలంటూ ఆర్బీఐ తన ట్వీట్లో పేర్కొన్నది. కొన్ని బ్యాంకులను మూసివేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదని కూడా ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను మూసివేయడంలేదన్నారు. కస్టమర్లకు ఉత్తమమైన సేవలను అందించేందుకు ప్రభుత్వమే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను బలోపేతం చేస్తుందని రాజీవ్ కుమార్ తెలిపారు.