బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు .ముజఫర్పూర్ జిల్లా కంటి పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 28పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కార్పియో వాహనం ట్రాక్టర్ ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.