telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

daggubatipurandeswari

నిధులు ఖర్చు చేశాక రాజధాని మార్పు చేయాలనుకోవడం భావ్యం కాదని బీజేపీ నేత పురంధేశ్వరి స్పష్టం చేశారు.కడప జిల్లాలో పర్యటించిన పురంధేశ్వరి రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం అంశం రాష్ట్ర ప్రభుత్వానిదేనని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. ఏపీలో బలమైన శక్తిగా బీజేపీ ఎదగడం ఖాయమని పురంధేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీకి దేశవ్యాప్తంగా పోటీ ఇవ్వగలిగే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సంక్షోభంలో ఉందన్నారు. రాహుల్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే వయోభారంతో బాధపడుతున్న సోనియాగాంధీని పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారంటూ ఎద్దేవా చేశారు.వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి రూ.50 కోట్లు ఇచ్చిందని తెలిపారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts