telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాజకీయ స్వలాభం‌ కోసమే జగన్‌తో కేసీఆర్ దోస్తీ: డీకే అరుణ

dk-aruna

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత, మాజీమంత్రి డీకే అరుణ విరుచుకుపడ్డారు.కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. రాజకీయ స్వలాభం‌ కోసమే ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ దోస్తీ చేస్తున్నాడంటూ ఆమే మండిపడ్డారు. ప్రస్తుతం రాయలసీమపై కేసీఆర్‌కు కొత్తగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో చెప్పాలని నిలదీశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనలో తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.

జూరాలకు గోదావరి నీళ్లు తీసుకువస్తానని కేసీఆర్ చెప్పడం ఒక అబద్దమన్నారు. గోదావరి నీళ్లు ఎప్పుడు గద్వాలకు వస్తాయో, జూరాలకు ఎప్పుడు తీసుకువస్తాయో అందరికీ తెలుసునన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారంటూ దుయ్యబట్టారు. ప్రాజెక్టుకు జూరాల ఫస్ట్ ఫేజ్ లోనే నీళ్లు తీసుకెళ్లాలని చెప్పుకొచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చాక పాలమూరు ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పిన కేసీఆర్ పాలమూరుకు వ్యతిరేకంగా కేసు వేసిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకున్నాడని విమర్శించారు.

Related posts