ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం సరఫరాకు ఇక నుంచి బ్రేక్ పడనుంది. దుకాణాలు సిండికేట్ లో కొట్టేసి బెల్ట్ దుకాణాలకు ఇబ్బడి ముబ్బడిగా మద్యం సరఫరా చేసే ప్రక్రియ ఇప్పటికే నిలిచిపోయింది. అక్టోబర్ నుంచి 20 శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యనూ తగ్గిస్తామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు.
బెల్టు షాపులపై ఉక్కుపాదం ఫలితంగా మద్యం వినియోగం భారీగా తగ్గుతోందని అన్నారు. దశల వారీగా మద్యం నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. మద్యం అక్రమ సరఫరా, నాటుసారాను అరికట్టేందుకు గ్రామా సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నట్టు ట్విటర్ లో పేర్కొన్నారు.